తెలంగాణలో అక్రమ చొరబాటుదారులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవడానికి ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ ట్విటర్లో డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో మరోసారి బంగ్లాదేశీయులు అక్రమ కార్యకలాపాలు చేస్తూ బుధవారం పట్టుబడ్డారని, నకిలీ హిందూ పేర్లను ఉపయోగించి పశ్చిమ బెంగాల్ ద్వారా హైదరాబాద్లోకి రోహింగ్యాలు చొరబడ్డారని తెలిపారు.