నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. గ్రామంలో కల్లు అమ్మకాలపై విక్రయాలపై గ్రామాభివృద్ధి కమిటీ పన్ను వేయగా, ఆ పన్నుని కట్టలేమని గౌడ కుటుంబాలు చెప్పాయి. ఈ వివాదం కారణంగా 15 కల్లుగీత కార్మిక కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. సాంఘిక బహిష్కరణ అంటే వెలివేయడమే. వారికి సంఘం నుండి వివిధ కుల వృత్తుల కారణంగా అందాల్సిన సేవలు అందవు. వారి వద్ద నుండి కల్లుని ఎవరూ కొనుగోలు చేయరు. దీనితో వారు పక్క గ్రామాలకు వెళ్లి కల్లు విక్రయాలు చేస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా గౌడ కుల మహిళల్ని రామాలయంలోకి రానివ్వలేదు గ్రామాభివృద్ధి కమిటీ. వారు సాంప్రదాయకంగా చేసే కుంకుమార్చన చేయనివ్వలేదు గ్రామాభివృద్ధి కమిటీ. దీనితో ఆ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కమిటీ సభ్యులపై కేసులు పెట్టి పలువురిని అరెస్ట్ చేశారు. ఇలా అరెస్ట్ అయినవారిలో ఆలయ పూజారి కూడా వున్నారు. దీనితో గ్రామస్తులు అధిక సంఖ్యలో జమ కూడి ఏరుగట్ల పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. కమిటీ సభ్యులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనితో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే గౌడ కులానికి చెందిన మహిళలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాముల వారి గుడిలోకి ప్రవేశించనివ్వకపోవడం, వారిని ఊరునుంచి వెళ్లిపోవాలని చెప్పడానికి సంబంధించి ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నది.
ఇలాంటి సంఘటనలు భారత రాజ్యాంగంలోని సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 కులం, మతం, లింగం, జన్మస్థల ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యతను నిషేధించి, దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది.
ఇలాంటి వివక్షకు గురైన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లేదా ఎస్సీ/ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఇలాంటి సంఘటనలు సమాజంలో ఇంకా కుల వివక్ష కొనసాగుతోందని సూచిస్తాయి. ఇవి రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘించేవి కావున, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు.
Add A Comment