ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. తుపాకులు గర్జించాయి.. తూటాలు పేలాయి. 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణపూర్ జిల్లా మాధ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు కలిసి కూంబింగ్ నిర్వహించాయి. మావోయిస్టులు తారసపడడంతో భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.