పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2025 జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశాలు “ఆపరేషన్ సిందూర్” అనంతరం జరిగే తొలి పార్లమెంట్ సమావేశాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సుమారు మూడు వారాలపాటు జరిగే ఈ సమావేశాల్లో శాసనపరమైన చర్చలు, బిల్లుల ప్రవేశం, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులు, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఈ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.