తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇక్కడి ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా? మొదటగా మేలు జరిగింది రాజకీయ నాయకులకు జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 90% ఆంధ్ర నాయకులు సీఎంలు గా ఉన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ నాయకులకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. మొదట కెసిఆర్ అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకుంటే ఇది జరిగేదా? అలాగే ఎంతోమంది నాయకులకు మంత్రి పదవులు ఇతరత్రా పదవులు వచ్చాయి.
ప్రజలకు ఎం మేలు జరిగింది. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తరువాత నిర్ణయాలు తీసుకోవడం నాయకులకు సులభం అయింది. అది రైతుబంధు అయినా రైతుభీమా అయినా కల్యాణ లక్ష్మి అయినా గురుకులాలు అయినా ఇంకే పథకాలు అయినా ప్రత్యేక రాష్ట్రము కాబట్టి ఎక్కువమంది ఒత్తిడి లేదు కాబట్టి సులభంగా నిర్ణయాలు తీసుకున్నారు. హైద్రాబాద్ అభివృద్ధి కొత్తగా కంపెనీలు రావడం అనేవి ప్రత్యేక రాష్ట్రము ఏర్పడడం వలన సులభం అయి ఉపాధి అవకాశాలు పెరిగాయి.
చాల పథకాలను ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశే అవకాశం ఉండేది కాదు. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడడం ద్వారా సాగు భూమి పెరిగింది నీటి వసతి పెరిగింది అలాగే భూముల ధరలు కూడా పెరిగి ఎంతోమందికి మేలు కలిగింది. పింఛన్లు రైతు బంధు డైరెక్ట్ గా డబ్బు ప్రజల అకౌంట్స్ లోకి వచ్చింది. ఇది జిల్లాల సంఖ్య పెరగడం వలన పాలన సులభం అయింది. ప్రజలు తమ సమస్యలను చెప్పటానికి దగ్గరి మార్గం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రము వలన రైతాంగానికి ఎంతో మేలు జరిగింది.
రాష్ట్రము ఏర్పడినా పెద్దగా మారని విషయాలను చూస్తే అవినీతి అలాగే ఉంది ప్రభుత్వ వ్యవస్థల పని తీరు అలాగే ఉంది. విద్యలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. అలాగే వైద్య రంగంలో కొంత మార్పు జరిగింది తప్ప చెప్పుకోదగిన మార్పు జరగలేదు. అయితే కొత్తగా జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు కొంతవరకు అది మేలు అయింది. రోడ్ల విషయంలో రవాణా రంగంలో కూడా చెప్పుకోదగిన మార్పు అయితే కొత్త రాష్ట్రంలో కనబడలేదు. కొత్త రాష్ట్రము ఏర్పడినా నాయకుల స్వభావాలు పెద్దగా మారలేదు. ఓవరాల్ గా చూసినప్పుడు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడడం ద్వారా తెలంగాణ ప్రజలకు మేలే జరిగింది.