అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(జూన్15) ఇరాన్ ను అమెరికా ఆస్తులపై ప్రతీకారం తీర్చుకోవద్దని హెచ్చరించారు. ఇరాన్ మనపై ఏ విధంగానైనా, రూపంలోనైనా దాడి చేస్తే, అమెరికా సాయుధ దళాల పూర్తి బలం, శక్తి ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో మీపైకి వస్తుంది” అని ట్రంప్ ట్రూత్ సోషల్ రాశారు. ఇజ్రాయెల్ శనివారం టెహ్రాన్ లోని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అంతేకాదు ఇరాన్ లోని బుషెహర్ ప్రావిన్స్లోని ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు ప్రాసెసింగ్ యూనిట్ను దాడి చేసిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ నగరాలైన తామ్రా, బాట్
యామ్, రెహోవోట్లో కనీసం పది మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు. తామ్రాలో నలుగురు మరణించగా, బాట్ యామ్లో ఆరుగురు మరణించినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఇరాన్ అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలు, ఉన్నత సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయను ప్రతిస్పందనగా.. టెహ్రాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ప్రారంభించింది. ఇరాన్ దాడులు శనివారం రాత్రి ప్రారంభమై తెల్లవారుజామున కొనసాగాయి. మరోవైపు ఇజ్రాయెల్ టెహ్రాన్ పై బాంబులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో 29 మంది పిల్లలు సహా కనీసం 60 మంది మరణించారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్ లోని ఒక ఇంటి సమీపంలో జరిగిన దాడిలో ముగ్గురు మహిళలు మరణించగా పది మంది గాయపడ్డారు. దీనికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ఇజ్రాయెల్ పై కొత్త క్షిపణుల దాడి చేసింది. ఇజ్రాయెల్ పై ఇరానియన్ క్షిపణులు జరిపిన దాడిలో గలిలీ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో నలుగురు మృతిచెందారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు, ప్రతీకార దాడుల క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు . చేశారు. ఇజ్రాయెల్ లోని అమెరికా సైనిక స్థావాలపై జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాను స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల,ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. తమపై దాడికి అమెరికా బలగాలు సాయం చేస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రూపంలోనైనా అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాల పూర్తి బలం, శక్తి ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో దాడి చేస్తుందని అన్నారు.