మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాలు కానీ సిద్ధంగా లేవని తెలుస్తున్నది. తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం ceasefire ప్రకటించాలని మావోయిస్టు లు పదేపదే లేఖలు విడుదల చేస్తున్నా, కాల్పుల విరమణ ప్రకటించినా కేంద్రం మొండిగా ముందుకు వెళ్తున్నదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, వ్యక్తుల జీవించే హక్కులను కాలరాస్తూ ఎన్కౌంటర్లకే బీజేపీ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నదని పౌర హక్కుల నేతలు విమర్శిస్తున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న ప్రకటనకు కట్టుబడిన మోదీ సర్కారు మానవ హననానికి పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవతావాదులు, ఎన్జీవోల ప్రతినిధులు, పౌర హక్కుల నేతలు శాంతి చర్చల కమిటీగా ఏర్పడి కేంద్రానికి, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. కాల్పుల విరమణకు శాంతిచర్చల కమిటీ సభ్యులు కోరుతున్నా, మావోయిస్టులు డివిజన్లు, రాష్ర్టాలు, కేంద్ర కమిటీలవారీగా లేఖలు రాస్తున్నా కేంద్రం మాత్రం ‘చర్చల్లేవ్.. ఎన్కౌంటర్లు మాత్రమే’ అంటూ తుపాకులతో సమాధానం ఇస్తున్నది.
తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్రం 50 వేల మంది బలగాలతో అడవుల్లో మోహరించి వ్యూహాత్మకంగా ఒకో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నది. ఎకడికకడ ఫార్వర్డ్ ఆపరేషన్ బేస్(FOB ) క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్న భద్రతా బలగాలు యుద్ధ తంత్రాలను అనుసరిస్తున్నాయి. మా వోయిస్టుల ప్రాబల్య విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గిస్తూ, వారిని ఒక ప్రాంతానికే పరిమితం చేసుకుంటూ, బయటకు వెళ్లే మార్గాలను ది గ్బంధిస్తూ లోనికి చొచ్చుకెళుతున్నాయి. మావోస్టులకు ప్రధాన స్థావరమైన ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో వరసగా ఎన్కౌంటర్లు జరిపి 21 రోజుల్లో 31 మందిని హతమార్చి ఆ స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అలాగే అబూజ్మడ్లో కోవర్టు ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు (బసవరాజు) సహా 27 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి ఆ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అలాగే మావోయిస్టులకు కీలక ప్రాంతాలైన బడేసెట్టి, మహారాష్ట్ర గడ్చిరోలిలోని కటేజారి వంటి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అందుకే మొన్నటి వరకు ఛత్తీస్గఢ్లోని 9 జిల్లాల్లో పూర్తిగా ఆధిపత్యం చలాయించిన మావోయిస్టులు ఇప్పుడు కేవలం 2 జిల్లాలకే పరిమితమయ్యారు.
గెరిల్లా యుద్ధాలు చేసి భద్రతా బలగాలను దెబ్బతీసిన మడావి హిడ్మానే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నట్టు భద్రతా బలగాలు చెప్తున్నాయి. ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’ కి చీఫ్గా ఉన్న హిడ్మా తన దళంలో అత్యాధునిక ఆయుధాలను ఉపయోగిస్తుంటాడని సమాచారం. హిడ్మా స్కెచ్ వేస్తే భదత్రా దళాల్లో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికీ బలగాలు చెప్తుంటాయి. ఆ పదునైన వ్యూహాల వల్లనే అతడు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక నేతగా ఎదిగాడని అంటారు. ఇప్పటికే కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న తెలుగు రాష్ర్టాలకు చెందిన సీనియర్ నేతలను ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేస్తున్న బలగాలు కేంద్రం సుక్మా నుంచి ఆ స్థానం దక్కించుకున్న హిడ్మా కోసం ముమ్మరంగా గాలిస్తున్నది. అయితే, మడావి హిడ్మా అడవుల్లో లేడని, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తనపై దాడి జరిగినట్టు మీడియాను, బలగాలను దారి మళ్లించడం హిడ్మాకు కొత్తేమీ కాదని కొందరు చెప్తున్నారు. గతంలోనూ హిడ్మా చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కావాలనే ఇలాంటి డైవర్షన్ వ్యూహాలు చేస్తుంటాడని అంటుంటారు. పాఠశాల స్థాయి వరకే చదువుకున్న హిడ్మా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మరాఠీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్తారు. అతడి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా కొన్ని కిలోమీటర్ల అవతల ఉన్న భద్రతా దళాల కదలికలు కూడా పసిగడతాడని అంటుంటారు.
నిరుడు 350 మందికిపైగా మావోయిస్టులు, అమాయక గిరిజనులను భద్రతా బలగాలు పొట్టన పెట్టుకున్నట్టు పౌరహక్కు ల సంఘాలు చెప్తున్నాయి. ఈ ఏడాది మొ దటి 3 నెలల్లోనే 103 మందిని హతమార్చిన భద్రతా బలగాలు.. ఏప్రిల్, మే నెల ల్లో మరో 100 మందికిపైగా మావోయిస్టులను కాల్చి చంపాయి. ఈ ఐదు నెలల్లో 209 మంది ఎన్కౌంటర్లలో చనిపోయిన ట్టు నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాల అదుపులో మావోయిస్టు నాయకులు బండి ప్రకాశ్, దిలీప్ సహా 10 మంది ఉన్నట్టు పౌర హక్కుల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బందీలుగా పట్టుకున్న వారిని కోర్టులో హాజరుపర్చాలని కోరుతున్నారు. మావోయిస్టులు తప్పి ంచుకునేందుకు వీలు లేకుండా ఉపగ్రహ నిఘా, డ్రోన్ల సాయంతో కాలు కదిపితే భద్రతా బలగాలు పట్టేస్తున్నాయి.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో వ్యూహంతో భద్రతా బలగాలు పట్టు సాధిస్తుండటంతో కేంద్రం కూడా చర్చలకు ససేమిరా అంటున్నది. మావోయిస్టు రహిత దేశం కోసం కేంద్రం కంకణం కట్టుకొని ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. కాల్పుల్లో పాల్గొన్న అధికారులకు కావాల్సిన ఆయుధాలు, ఆర్థిక సంప త్తి, కార్యచరణ అందిస్తున్నారు. గెరిల్లా యుద్ధతంత్రంలో చర్చలు అనేవి వ్యూహాత్మ క ఎత్తుగడగానే అధికారులు భావిస్తున్నా రు. చర్చల పేరుతో కార్యకలాపాలు నిలిపివేస్తే మిగిలిన మావోయిస్టులు తలోదికుకు వెళ్లిపోయి మళ్లీ బలం పెంచుకుంటారని భా విస్తున్నారు. అందుకే చర్చల ప్రసక్తే లేదని, లొంగిపోవడం ఒకటే మావోయిస్టుల ముందున్న మార్గమని, లేకపోతే తూటాలకు బలికావాల్సిందేనని అంటున్నారు.