ఇథనాల్ కంపెనీకి ( Ethanol company ) వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులను అరెస్టు( Farmers Arretst ) చేసి జైలుకు పంపగా అక్కడి నుంచి వారికి కోర్టుకు బేడీలు వేసి తీసుకెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అరెస్టయిన 12 మంది రైతులను మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు బేడీలు ( Handcuffed ) వేసి తరలించారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఒక ఆర్ఎస్సై , ఇద్దరు ఏఆర్ఎస్సై ( ARSI )ను సస్పెండ్ ( Suspension ) చేస్తూ జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ( SP T Srinivas Rao ) ఉత్తర్వులు జారీ చేశారు. రాజోలి పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసులోని వ్యక్తులను అధికారుల సూచనలు పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన 12 మంది అన్నదాతలపై పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ రిమాండ్ ముగియడంతో.. వారిని మహబూబ్నగర్ కోర్టు నుంచి అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు. అయితే రాజోలి రైతులకు సంకెళ్లు వేసి అలంపూర్ కోర్టులో హాజరు పరచడం.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నేరస్తుల లాగా రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు.
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన 12మంది రైతులకు నిన్ననే బెయిల్ మంజూరైంది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని పోరాటం చేసిన ఘటనలో 12 మంది రైతులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 4న జైలుకెళ్లిన వీరికి 14 రోజుల తర్వాత కండీషన్ బెయిల్ మంజూరైంది. బెయిల్ వచ్చాక కూడా రైతులకు బేడీలు వేయడం ఎంతవరకు సమంజసం అని బీఆర్ఎస్ నేతలు మండి పడుతున్నారు.