భారత జావెలిన్ త్రో హీరో, ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra), రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన తొలి పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ను దక్కించుకున్నాడు. తన మొదటి రౌండ్లోనే టైటిల్ గెల్చుకున్నాడు, కానీ తర్వాత ఐదు త్రోలలో అతను 90 మీటర్ల మార్కును చేరుకోలేకపోయాడు.
ఒలింపిక్ పతక విజేత భారత జావెలిన్ త్రో సూపర్స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) రెండేళ్ల తర్వాత తన తొలి పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నాడు. బలమైన ఫీల్డ్లో 90 మీటర్ల మార్కును చేరుకోకుండానే జర్మన్ ప్రత్యర్థి జూలియన్ వెబర్ను అధిగమించాడు. 27 ఏళ్ల చోప్రా శుక్రవారం రాత్రి తన మొదటి రౌండ్ త్రోలో 88.16 మీటర్లు త్రో చేసి టైటిల్ను గెలుచుకున్నాడు. ఇందులో ప్రతిష్టాత్మక 90 మీటర్ల క్లబ్ నుంచి ఐదుగురు ఉండటం విశేషం.
అతని రెండో త్రో 85.10 మీటర్లు కాగా, అతను తన తదుపరి మూడు ప్రయత్నాలను ఫౌల్ చేసి తన ఆరవ, చివరి ప్రయత్నంలో 82.89 మీటర్లు నమోదు చేశాడు. వెబెర్ తన ప్రారంభ త్రోతో 87.88 మీటర్లతో రెండో స్థానంలో నిలిచాడు. బ్రెజిల్కు చెందిన లూయిజ్ మౌరిసియో డా సిల్వా తన మూడో రౌండ్ ప్రయత్నంతో 86.62 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.
2022లో నీరజ్ జ్యూరిచ్లో 88.44మీటర్లతో మొదటి డైమండ్ లీగ్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత మరోసారి రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ అదే రోజున టైటిల్ సాధించడం విశేషం. 2024లో బ్రుసెల్స్ ఫైనల్లో 87.86 మీటర్లతో 1సెం. తేడాతో రెండో స్థానంలో నిలిచాడు నీరజ్. ఇలా చూస్తే, అతని నిరంతర శ్రమ, స్థిరమైన పట్టుదల మళ్లీ టైటిల్ సాధించేలా చేశాయి.