Monday, 2 March 2026

ఇన్ఫోసిస్‌ బోనస్: ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు శుభవార్త.. ఆగస్టు జీతంతో 80% బోనస్‌

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ (Infosys) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి గానూ పనితీరు ఆధారిత బోనస్‌లను ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 80 శాతం చొప్పున బోనస్‌ చెల్లించనుంది. ఆగస్టు నెల వేతనంతో ఈ మొత్తం చెల్లింపులు చేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఈ మేరకు అంతర్గతంగా సందేశాలు పంపుతోంది. క్యూ1లో మెరుగైన పనితీరు నేపథ్యంలో కంపెనీ ఈ స్థాయిలో బోనస్‌ను ప్రకటించడం గమనార్హం.

పనితీరు ఆధారంగా ఈ చెల్లింపులు జరగనున్నాయి. లెవల్‌ పీఎల్‌4 ఉద్యోగుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి అత్యధికంగా 89 శాతం బోనస్‌ చెల్లిస్తారు. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 80 శాతం చొప్పున చెల్లింపులు చేయనున్నారు. అలాగే, లెవల్‌ పీఎల్‌5, లెవల్‌ పీఎల్‌6 ఉద్యోగులకు 78-87 శాతం, 75-85 శాతం చొప్పున చెల్లిస్తారు. పీఎల్‌4, పీఎల్‌5, పీఎల్‌6 కేటగిరీల్లో ‘దృష్టి సారించాల్సిన’ ఉద్యోగులకు కూడా 80 శాతం, 75 శాతం, 70 శాతం చొప్పున బోనస్‌ చెల్లించనున్నట్లు ఇంటర్నల్‌ మెమోలో ఇన్ఫోసిస్‌ పేర్కొంది. వ్యక్తిగత బోనస్‌ లెటర్లను ఉద్యోగుల ఇ-డాకెట్స్‌లో అప్‌లోడ్‌ చేస్తామని పేర్కొంది.

జులై 23న వెలువరించిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్ఫోసిస్‌ అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 8.7 శాతం వృద్ధి చెంది రూ.6921 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7.5 శాతం వృద్ధితో రూ.42,279 కోట్లుగా పేర్కొంది. రెండు మెట్రిక్స్‌లోనూ అంచనాలను మించిన పనితీరును కంపెనీ నమోదు చేసింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు