Tuesday, 17 March 2026

జీతం అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చోబెట్టారు

శాల‌రీ అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొబెట్టార‌ని, రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశార‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ఉప్ప‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఉప్ప‌ల్ ఐడీఏలోని ఐటీ పార్కులో ఫ్రూజెస్ ఐటీ స‌ర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. మంగ‌ళ‌వారం నాడు డ్యూటీ ఉన్న స‌మ‌యంలో జులై నెల‌కు సంబంధించిన జీతాలు ఎప్పుడు ఇస్తార‌ని యాజ‌మాన్యాన్ని అడిగిన‌ట్లు వారు తెలిపారు. అంతే.. వెంట‌నే కంపెనీకి పోలీసుల‌ను ర‌ప్పించి 14 మంది ఉద్యోగుల‌ను ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకొచ్చార‌న్నారు.

బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు త‌మ‌ను పీఎస్‌లోనే కూర్చొపెట్టి మ‌నోవేద‌న‌కు గురిచేశార‌ని వారు వాపోయారు. అయితే, ఉద్యోగులు గొడ‌వ చేయ‌డంతోనే కంపెనీ యాజ‌మాన్యం ఫిర్యాదు చేసింద‌ని పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేర‌కే ఉద్యోగుల‌ను పీఎస్‌కు తీసుకొచ్చామ‌న్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు