Monday, 2 March 2026

100 దేశాలకు ఎగుమతి లక్ష్యం.. మారుతీ సుజుకీ ఈవీ కారును ప్రారంభించిన మోదీ

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని హన్సల్‌పుర్ మారుతీ సుజుకీ మోటార్ ప్లాంట్‌లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతీ సుజుకీ తొలి ఇవి కారు ఇ-విటారా (eVITARA)తో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్‌ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్‌కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచీ ఒనొ పాల్గొన్నారు. మోదీ ఈ ఈవీ కారును ఫ్లాగ్-ఆఫ్ చేశారు, ఇది భారత్‌లో తయారైన మొదటి ఈవీ SUVగా 100కి పైగా దేశాలకు ఎగుమతి కానుంది.

“భారత్‌ స్వాలంబన సాధించేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు ఇది ప్రత్యేకమైన రోజు. ఇక్కడ ఉత్పత్తి కానున్న కార్లు 100 దేశాలకు ఎగుమతి కానున్నాయి” అని ఈ కార్యక్రమానికి ముందు మోదీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇ-విటారా (eVITARA) తొలి కారు యూకేకు ఎగుమతి కానుంది. తొషిబా, డెన్సో, సుజుకీ సంస్థల భాగస్వామ్యంతో ఆ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్‌ తయారుకానున్నాయి. దాంతో 80 శాతం బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. మోదీ మాట్లాడుతూ, “ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డజన్ల దేశాల్లో నడిచే ఈవీలపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని రాసి ఉంటుంది” అని పేర్కొన్నారు. ఇది భారత్-జపాన్ సంబంధాల బలాన్ని, భారత్‌పై గ్లోబల్ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన తొలి విద్యుత్‌ కారు ఇ-విటారా (Maruti Suzuki eVITARA) జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా భారత్‌ను గ్లోబల్‌ ప్రొడక్షన్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అప్పుడు వెల్లడించారు. మారుతీ సుజుకీ ఇ-విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లతో (49kWh, 61kWh) వస్తోంది. 49 కిలోవాట్‌ అవర్ బ్యాటరీతో వస్తున్న కారు 144 హెచ్‌పీ శక్తిని, 189 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 61kWh బ్యాటరీ 174 బీహెచ్‌పీని 189 Nm టార్క్‌ను విడుదల చేస్తుందని తెలుస్తోంది. అతిపెద్ద బ్యాటరీ వేరియంట్‌ 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప్రదర్శించిన వీడియోలో పేర్కొంది. భారత్‌లో ఇది సెప్టెంబర్ 3, 2025 నాటికి లాంచ్ కానుంది, మొదటి మార్కెట్‌గా యూకేలో ఇప్పటికే అందుబాటులో ఉంది.

100 సిటీల్లో ఛార్జింగ్‌ పాయింట్లు
భారత్‌ లో ఇ-విటారా తయారీకి రూ.2,100 కోట్లు వెచ్చించినట్లు మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీఈఓ హిసాషి టకేయుచి గతంలో తెలిపారు. మారుతీ సుజుకీ ఈవీలు కొనుగోలు చేసేవారికి స్మార్ట్‌ హోమ్‌ ఛార్జర్‌, ఇన్‌స్టలేషన్‌ సపోర్ట్‌ను అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలో 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సదుపాయాలను అందించనున్నట్లు వివరించారు. ప్రతి 5-10 కిలోమీటర్లకు మారుతీ సుజుకీ ఛార్జింగ్‌ పాయింట్లను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈవీ అడాప్షన్‌కు ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యమైన అడ్డంకిగా ఉందని మారుతీ అధికారులు స్పష్టం చేశారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు