అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ (Scott Bessent) ఇటీవల ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇటీవల (జనవరి 2026లో) ఇండియా-EU మధ్య ఒక పెద్ద ట్రేడ్ డీల్ కుదిరింది. ఇది ఆటోమొబైల్స్, స్పిరిట్స్, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో టారిఫ్లు తగ్గించి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో ఉంది. బెసెంట్ CNBC ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ డీల్ తనను “చాలా నిరాశపరిచింది” అని, యూరప్ వారు వాణిజ్య లాభాలను ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజల ప్రయోజనాల కంటే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని ఆయన విమర్శించారు.
రష్యా నుంచి సంక్షోభ రష్యన్ ఆయిల్ను ఇండియా కొనుగోలు చేసి, రిఫైన్ చేసి EUకు ఎగుమతి చేస్తోంది. దీంతో EU పరోక్షంగా రష్యా యుద్ధానికి ఫండింగ్ చేస్తోందని ఆయన ఆరోపణ.
రష్యా మీద ఆర్థిక ఒత్తిడి పెంచాలని, కానీ EU-ఇండియా డీల్ దానికి విరుద్ధంగా ఉందని ఈ వ్యాఖ్యలు ట్రంప్ ప్రభుత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.


