సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళీ కి అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయస్థానం తీర్పుపై స్పందించిన పోసాని న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పోసానిపై రిమాండ్ విధించడాన్ని పరిశీలిస్తే “ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్” అన్నట్లు ఉందన్నారు. పోసాని వ్యాఖ్యలు వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు పెట్టిన రెండు సెక్షన్లపై మేజిస్ట్రేట్ ఏకీభవించారని ఫలితంగానే పోసానికి రిమాండ్ విధించారని అన్నారు. బీఎన్ఎస్ యాక్ట్ 111 సెక్షన్ను మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోలేదని ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేస్తామని పొన్నవోలు స్పష్టం చేశారు.