తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దర్శన టికెట్ వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది. మొత్తం 7,500 గదులు ఉండగా, సీఆర్వో పరిధిలో 3,500 గదులను కరెంట్ ఆధార్ సామాన్య భక్తులకు కేటాయిస్తారు. అడ్వాన్స్ 1,580 గదులు, దాతలకు 400 గదులను టీటీడీ కేటాయిస్తుంది. మరో 450 గదులను అరైవల్ మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ వీఐపీలకు జారీ చేస్తున్నది. ఈ గదులను పద్మావతి విచారణ కేంద్రం, ఎంబీసీ, టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ దర్శన టికెట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
నిరుడు గదులు కేటాయింపు.. నిరుడు వీఐపీ గదులను ఆధార్ దళారులు పెద్దఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు. వాటిని 48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు, ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం ఉంటుంది.