ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ (Freedom of Press) గురించి జర్నలిస్ట్ ల గురించి రాజ్యాంగంలో ఎక్కడాలేదు. Article 19(1)(a) ప్రకారం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద పత్రికా స్వేచ్ఛ వస్తుంది. మాములు సిటిజెన్ కు ఎలాంటి విధులు హక్కులు బాధ్యతలు ఉంటాయో అలాగే జర్నలిస్టులకు ఉంటాయి. జర్నలిజం అన్ని వృత్తుల్లాగే ఒక వృత్తి మాత్రమే.
ఆర్టికల్ 19(1)(a) పౌరులకు వారి ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును అందిస్తుంది. ఇందులో ప్రసంగం, రచన, ముద్రణ, దృశ్య ప్రాతినిధ్యాలు లేదా మరే ఇతర మార్గాల ద్వారా తనను తాను వ్యక్తీకరించుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది.
అయితే భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రత, రాష్ట్ర భద్రత, కోర్టు ధిక్కారం, పరువునష్టం, నేరానికి ప్రేరేపించడం లేదా పార్లమెంటు సార్వభౌమాధికారం మరియు సమగ్రత ప్రయోజనాల కోసం ఈ హక్కుపై సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు.
భావప్రకటనా స్వేచ్చ అనేది అందరికి సమానమే. జర్నలిస్టులకు ప్రత్యేకంగా లేదు. ఏ పౌరుడు అయినాసరే వార్తలు సేకరించవచ్చు, విశ్లేషించవచ్చు, చెప్పవచ్చు, రాయవచ్చు దీనికి ప్రత్యేకమైన గుర్తింపు అవసరంలేదు. ఇస్టమొచ్చినట్లు ఇతరులను కించపరచడం, అబ్యూస్ చేయడం అనేది ఎవరు చేసినా శిక్ష ఒకటే. జర్నలిస్ట్ కాకుండా ఇతరులు చేస్తే వాళ్ళు క్రిమినల్స్ జర్నలిస్టులు గా గుర్తించబడిన వాళ్ళు చేస్తే వాళ్ళు నాన్ క్రిమినల్స్ గా చట్టంలో ఎక్కడ లేదు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో అందరు జర్నలిస్టులే. ఎవరు నిష్పకాక్షికంగా నిస్వార్థంగా నిజాయితీగా విషయం చెబితే దాన్ని ప్రజలు నమ్ముతారు. దీని కొరకు జర్నలిస్ట్ కావలసిన అవసరం లేదు. కాలంతోపాటు టెక్నలాజీbg కొత్తపుంతలు తొక్కుతోంది, దానికి అనుగుణంగానే మార్పులు వస్తుంటాయి వాటి గురించి అవగాహన పెంచుకోకపోతే నవ్వులపాలు అవుతారు.