Friday, 7 August 2026

2025 మొదటి త్రైమాసికంలో 14,000 మేనేజర్లను తొలగించనున్న అమెజాన్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తాజాగా 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కంప్లీట్ సర్కిల్ సీఈఓ గుర్మీత్ చద్దా సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్పొరేట్ జార్గన్ (అర్థం లేని పదజాలం) మరియు కృత్రిమ మేధస్సు (AI) పేరుతో ఉద్యోగాల కోతలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

జీతాలు ఎక్కువగా ఉండే 14,000 మేనేజర్లను అమెజాన్ పదవుల నుంచి తప్పించనుంది. 2025 తొలి త్రైమాసికంలోనే వీరందరికీ ఉద్వాసన పలుకుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా అమెజాన్ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ తో అమెజాన్ లో మేనేజర్ స్థాయి సిబ్బంది సంఖ్య 1,05,770 నుంచి 91,936 కు తగ్గుతుంది.

కరోనా సమయంలో అమెజాన్ భారీగా నియామకాలు చేపట్టింది. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2019 లో 7,98,000 గా ఉండగా, 2021 ముగిసే నాటికి 16 లక్షలకు చేరింది. అయితే 2022 నుంచి లేఆఫ్స్ చేపట్టి ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.

అమెజాన్ సీఈఓ Andy Jassy సంస్థాగత పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేశారు. మధ్యస్థాయి నిర్వహణను తగ్గించి, సంస్థ
సమర్థతను పెంచడమే ఆయన లక్ష్యం. 2025 నాటికి మధ్యస్థాయి మేనేజర్లను 15% తగ్గించాలనే లక్ష్యాన్ని Jassy ఇప్పటికే అధిగమించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సంస్థలో ఎక్కువ మంది చేరితే, మధ్యస్థాయి నిర్వహణ పెరిగిపోతుందని, అనవసరమైన సమావేశాలు, చర్చలు పెరుగుతాయని ఆయన అన్నారు.

నిర్వహణ స్థాయిలను తగ్గించి, ఉద్యోగులకు మరింత స్వాతంత్ర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాస్సీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జెన్ Z ఉద్యోగులు స్వాగతిస్తున్నారు. సాంప్రదాయ నిర్వహణ శైలికంటే, స్వీయ నిర్వహణనువారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మధ్యస్థాయి నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి జెన్ Z ఉద్యోగులు ఇష్టపడటం లేదని, పర్యవేక్షణ బాధ్యతలు లేకుండానే కెరీర్‌లో ఎదగాలని వారు కోరుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది.

అమెజాన్ ఉద్యోగుల తొలగింపు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. Wisdom Hatch వ్యవస్థాపకులు అక్షత్ శ్రీవాత్సవ ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. అమెజాన్ క్యాష్ నిల్వలు 100 బిలియన్ డాలర్లకంటే ఎక్కువగానే ఉన్నాయని, అలాంటప్పుడు 14,000 మంది ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆ డబ్బును బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా 5 శాతం వడ్డీతో 5 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు