Bijapur Encounter:
బీజాపూర్ లో మరొకసారి భారీ ఎన్కౌంటర్. కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి. బీజాపూర్, దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్కు జాయింట్ టీమ్ బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో, ఈరోజు 20/03/2025 ఉదయం 07 గంటల నుండి మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరుగుతున్నాయి.
ఎన్కౌంటర్ స్థలం నుండి భారీ మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పద్దెనిమిది మంది నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ DRGకి చెందిన ఒక సైనికుడు ఎన్కౌంటర్లో వీరమరణం పొందాడు. ప్రాంతంలో ఎన్కౌంటర్, సోదాలు కొనసాగుతున్నాయి.