బీదర్ లో BRS అగ్రనేతకు ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉండేదని, ఆ ప్రెస్ లో BRS పాంప్లెట్స్ కాకుండా దొంగనోట్లు ముద్రించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో సిద్దిపేట SP గా పనిచేసిన ఆఫీసర్ తనకు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. ఆ ప్రెస్ ను సీజ్ చేసేందుకు ఆయన వెళ్తుంటే.. రాష్ట్రంలోని ముఖ్యనాయకుడు ఫోన్ చేసి ఆపినట్టు ఆయన చెప్పారని వెల్లడించారు. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పంచినవన్నీ దొంగనోట్లేనని, అప్పుడు ఆ నోట్లు ఎలా చెల్లాయోనని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పాస్ పోర్టు, దొంగనోట్ల దందా చేసిన కుటుంబం వేలకోట్లు సంపాదించిందని సంజయ్ మండిపడ్డారు. కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లిక్కర్ దొంగలంతా ఒకేచోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘దేశ GDPలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతం వాటా ఇవ్వాలని అడుగుతున్నరు.
కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రిగా ఏం చేయాలి? కేసు పెట్టాలి అరెస్ట్ చేయాలి. అది వదిలేసి ఇలా ఆరోపణలు చేయడం చూస్తుంటే దేశరాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుంది.