Friday, 7 August 2026

మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు, వినతులు, విజ్ఞాపనలు…

మంత్రివర్గ విస్తరణకు ముందే కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. కేబినెట్లో తమ వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాలని డిమాండ్లు తెరమీదకు వచ్చాయి. తమ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు అధిష్టానానికి వినతులు పంపించారు. తమ వర్గానికి మంత్రి పదవులు ఎందుకు ఇవ్వరనే విషయాన్ని తెలుసుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్లను కలిసి విజ్ఞప్తులు అందజేశారు. జనాభా దామాషా ప్రకారం తమ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఎక్కడ చూసిన మాదిగ, లంబాడ ఎమ్మెల్యేల హడావుడి కనిపించింది.

ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లకు తమ వినతులను మెయిల్, ఫ్యాక్స్ ద్వారా పంపారు. ‘రాష్ట్రంలో మాదిగ జనాభా దాదాపు 48 లక్షల మంది ఉన్నారు. కానీ, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ మధ్య భర్తీచేసిన ఎమ్మెల్సీల్లోనూ అవకాశం ఇవ్వలేదు. అందుకే కేబినెట్లో తమ కులం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారు. కానీ, ఇప్పటి వరకు తమ వర్గానికి కేబినెట్లో చోటులేదు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం కల్పించండి’ అంటూ ఎస్టీ లంబాడ ఎమ్మెల్యేలు సైతం లేఖలో అధిష్ఠానానికి వివరించారు.

సీఎం, డిప్యూటీ సీఎంలకు వినతులు: మంత్రివర్గ విస్తరణలో తమ వర్గాలకు అవకాశం కల్పించాలని, ఈ మేరకు పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించాలని మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్లను విడివిడిగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఆ ఫ్యామిలీల్లో ఒకటికంటే ఎక్కువ పదవులు! వివేక్, రాజగోపాల్ రెడ్డిలకు మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం నేపథ్యంలో ఆ రెండు కుటుంబాల్లో ఎంతమందికి పదవులు ఇస్తారు? అనే చర్చ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది. ఇప్పటికే వివేక్ తో పాటు ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేలుగా, వివేక్ కొడుకు పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. వాళ్లకు అదనంగా మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అని మాదిగ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి అందరికి అవకాశం ఇవ్వడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. మళ్లీ ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని సైతం కేబినెట్ లోకి తీసుకోవడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే డిస్కషన్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు