చత్తీస్ఘడ్ అడవులు మరోసారి దద్దరిల్లాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతిచెందారు. గోగుండ కొండల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం అందిన భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో వారికి మావోలు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.