Saturday, 8 August 2026

తన సుఖం కోసం ముగ్గురు కన్నబిడ్డల్ని కడతేర్చిన కన్నతల్లి

తమ భయాలకో, స్వార్ధాలకో పసిపిల్లల ఉసురు తీసే కన్నవారి దౌష్ట్యాలకు అంతు వుండటం లేదు. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో వెలుగు చూసిన ముగ్గురు చిన్నారుల హత్య కేసు కీలక మలుపు తిరిగింది. తన వివాహేతర సంబంధం కొనసాగటానికి, ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి పిల్లలు అడ్డుగా వున్నందున ఆ చిన్నారులను కన్నతల్లి రజితే చంపిందని పోలీసులు తేల్చారు. తన ముగ్గురు పిల్లలను తానే స్వయంగా గొంతు నులిమి చంపానని రజిత అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకటో ముద్దాయి ఐన రజితని, రెండో ముద్దాయి ఐన ఆమె ప్రియుడు శివని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పి పరితోష్ పంకజ్ మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే: రజిత అలియాస్ లావణ్యకు ఇంటర్మీడియేట్ రెండో సంవత్సరం చదువుతున్న సమయం(2013)లో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన అవురిచింతల చెన్నయ్యతో వివాహం జరిగింది. వీరికి సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతం (8) పిల్లలున్నారు. చెన్నయ్య వాటర్ టాంకర్ డ్రైవర్ గా, రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. ఆరు నెలల క్రితం రజితకి తన పదో తరగతి క్లాస్మేట్, స్నేహితుడు ఐన శివతో స్నేహం మళ్లీ చిగురించింది. నిత్యం చాటింగ్, కాల్స్, వీడియోకాల్స్ మాట్లాడేవారు. చాలాసార్లు శారీరికంగా కూడా కలిశారు. రజిత చెన్నయ్య మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ వుండటంతో రజితకు చెన్నయ్య అంటే ఇష్టం వుండేది కాదు. తరుచూ గొడవలు పడేవారు.

శివ కలిసినప్పటి నుండి తన జీవితం ఆనందంగా వుందని, శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె భావించి శివని అడిగితే ఒకవేళ రజితకి పెళ్లి అవకున్నా చేసుకునేవాడినని, కనీసం పిల్లలు లేకున్నా చేసుకునేవాడినని శివ ఆమెతో చెప్పడంతో ఎలాగైనా పిల్లల అడ్డు తొలగించుకోవాలని అనుకున్నది. ఈ క్రమంలోనే మార్చ్ 27న పిల్లల్ని చంపేస్తానని శివకు చెప్పింది. అదే రోజు రాత్రి భర్త చెన్నయ్య టాంకర్ తీసుకొని చందానగర్ వెళ్లిన సమయంలో ముగ్గురు పిల్లలను ఒకరి తరువాత ఒకరిని ఊపిరాడకుండా చేసి చంపేసింది.

తన స్వార్ధం కోసం, సుఖం కోసం కన్నతల్లే స్వయంగా తన చేతులతో తన కడుపున పుట్టిన బిడ్డల్ని హత్య చేసిన హృదయాన్ని కలిచేవేసే ఈ దారుణ సంఘటనని విశ్లేషిస్తే ఆమె తల్లిదండ్రులు, భర్త పరోక్ష హంతకులు అని తేలుతుంది. ఇంటర్మీడియేట్ చదివే అమ్మాయంటే బహుశా మైనారిటీ కూడా తీరని సమయంలో ఆమెకి తన కంటే ఇరవై ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో వివాహం చేసిన ఆమె తల్లిదండ్రులు కూడా దోషులే. తన కంటే ఇరవై ఏళ్ల చిన్నదైన అమ్మాయిని వివాహం చేసుకోవడమంటే ఆమె జీవితాన్ని నాశనం చేయడమనే ఇంగితం ఆమె భర్త చెన్నయ్యకు లేకపోవడం వల్ల అతనూ నిందితుడే. తన భర్త వల్ల, అతనితో కాపురం వల్ల ఆమెకి జీవితంలో మిగిలింది అసంతృప్తే. ఆ అసంతృప్తే ఆమెని కన్నబిడ్డల్ని చంపుకునేంత అమానుషంగా మార్చేసింది. పిల్లల్ని చంపడమంటే వారి అడ్డు తొలగించుకోవడమనే అనుకున్నదే కానీ చట్టం నుండి, అది వేసే శిక్ష నుండి తప్పించుకోవడం సాధ్యం కాదనే విచక్షణని కోల్పోయింది. చివరికి హంతకురాలై కటకటాల పాలయింది.

రజిత ఒక్కతే హంతకురాలందామా మరి?

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు