దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు (2013) నిందితులకు మరణశిక్షను సమర్ధించిన హైకోర్ట్
21 ఫిబ్రవరి 2013 న దిల్సుఖ్నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఎన్.ఐ.ఏ. కోర్ట్ విధించిన మరణశిక్షను తెలంగాణ హైకోర్ట్ మంగళవారం ధృవీక్రించింది. వివరాల్లోకి వెళితే 21 ఫిబ్రవరి, 2013న రెండు సమాంతర పేలుళ్లు — ఒకటి షిర్డీ సాయి బాబా మందిరం దగ్గర, మరొకటి వెదురుబజార్ బస్ స్టాండ్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు.
National Investigation Agency (NIA) ప్రత్యేక కోర్టు 2016లో ఐదుగురు దోషులు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్, యాసిన్ భట్కల్, అజాజ్ షేక్ లకు మరణదండన విధించింది。 దోషులు తమ శిక్షను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు, కానీ హైకోర్టు ఆ అప్పీలను తిరస్కరించి, NIA కోర్టు తీర్పును సమర్థించింది.
ఈ తీర్పు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో న్యాయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాధారణంగా Capital Punishment (మరణశిక్ష) విధించే క్రమంలో “Rarest of rare” అనే doctrine ని అన్వయిస్తారు. అంటే కేసు అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన కేసు అయ్యుండాలి. భారతదేశం మరణశిక్షను సాధారణంగా విధించదు. కానీ జాతికి ప్రమాదంగా ఉండే, ఉద్దేశపూర్వకమైన తీవ్ర దుష్కృత్యాలకు ఇది వర్తిస్తుంది. నిందితులపై సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, Identity వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి.
అప్పీలకు అవకాశం: ఇప్పుడు దోషులకు సుప్రీంకోర్టులో రివ్యూలు, Curative Petition, రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ లాంటి మార్గాలు మిగిలి ఉన్నాయి.