26, నవంబర్ 2008 ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతిని అనుసరించి, భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు రాణాను అమెరికా నుండి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకు వస్తున్నారు. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజాము ఆ విమానం భారత్ చేరవచ్చు.
తనను భారత్ కు అప్పగించవద్దంటూ రాణా దాఖలు చేసిన Review Petition ను 2025 జనవరి 21న అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది, తద్వారా ఆయనను భారత్కు అప్పగించడానికి మార్గం సుగమం అయింది. రాణా అప్పగింతపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సైతం భారత ప్రధాన మోడీ అమెరికా పర్యటన సమయంలో హామీ ఇచ్చారు. “26/11 ముంబాయి ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకుంటాం” అని ట్రంప్ ప్రకటించిన మేరకు ఇవాళ రాణాను భారత్ కు అప్పగించారు.
తహవూర్ రాణా, పాకిస్తాన్లో జన్మించిన కెనడియన్ వ్యాపారవేత్త, 2008 ముంబై ఉగ్రదాడుల్లో పాత్ర ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. prastutam Los Angels జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. రాణాను భారత్కు తీసుకువచ్చిన తరువాత, ఆయనపై భారత న్యాయవ్యవస్థలో విచారణ కొనసాగుతుంది.
ఈ పరిణామాలు భారత్ మరియు అమెరికా మధ్య న్యాయ సహకారాన్ని ప్రతిబింబిస్తాయి. ఉగ్రవాద నేరస్తులను చట్టం ముందు నిలబెట్టడంలో ప్రాముఖ్యతను చూపుతాయి.