తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” జ్యూరీ కమిటీ చైర్పర్సన్గా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ నియమితులయ్యారు. ఈ అవార్డులు రాష్ట్ర సినిమా రంగంలో ప్రతిభను గుర్తించి గౌరవించేందుకు ఏర్పాటు చేయబడ్డాయి.
జయసుధ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు హరీశ్ శంకర్, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, రచయిత గుమ్మడి వెన్నెల, దర్శకుడు అల్లాణి శ్రీధర్, నటుడు బలగం వేణు తదితరులు ఉన్నారు .
జ్యూరీ కమిటీ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ ఎండీ డాక్టర్ హరీష్, ఈడీ కిషోర్ బాబు సమక్షంలో సమావేశమై, నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని నిర్ణయించింది . ఈ సమావేశంలో, 1,248 నామినేషన్లను పరిశీలించేందుకు ఏప్రిల్ 21 నుండి స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు .
గద్దర్ అవార్డులు, జాతీయ సమైక్యత, సాంస్కృతిక విలువలు, మానవతా భావాలు ప్రతిబింబించే సినిమాలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అవార్డుల ద్వారా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్స్, బాలల చిత్రాలు, తెలుగు సినిమాపై రచనలు వంటి విభాగాలలో ప్రతిభను గౌరవించనున్నారు .
ఈ అవార్డుల ప్రారంభోత్సవం ఉగాది పండుగ సందర్భంగా జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ను అంతర్జాతీయ సినీ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది .
గద్దర్ అవార్డుల జ్యూరీ చైర్పర్సన్గా జయసుధ నియామకంకి ఎంతో ప్రాధాన్యత వుంది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ వంటి లెజెండరీ పేరున ఏర్పాటు చేసిన మొదటి అవార్డుల కమిటీకి జయసుధ వంటి సీనియర్ నటికి సారధ్యం వహించే అవకాశం ఇవ్వడం సముచితంగా వుంది.