ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 మే 2న అమరావతికి పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక వైపు బహిరంగ వేదికను ఏర్పాటు చేయనున్నారు.
ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి మోదీ సుమారు ₹1 లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవి అమరావతి మరియు రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి .
ఈ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మంత్రుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, పి. నారాయణ వంటి మంత్రులు ఉన్నారు. ఈ కమిటీ ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షిస్తుంది. ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పిజి బృందం పర్యవేక్షిస్తుంది. ఉమ్మది ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి 5 లక్షల మంది ప్రజలు హాజరు అవుతారని అంచనా.
ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.
ఈ పర్యటనతో అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం అవుతోంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ముందడుగు.