హైదరాబాద్ పంజాగుట్టలో వున్న ప్రతిష్టాత్మక NIMS (Nizam’s Institute of Medical Sciences) ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం భవనతిలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ ఫ్లోర్ లో హఠత్తుగా మంటలు చెలరేగాయి. కిటికీల నుండి దట్టమైన పొగలు రావడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు మరియు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీ చేయించారు.
ఈ ప్రమాదం సమయంలో ఐదో అంతస్తులో మెడికల్ గ్యాస్ట్రో మరియు సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలు ఉన్నాయి. పొగలు ఎక్కువగా రావడంతో రోగులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. సిబ్బంది అద్దాలను పగులగొట్టి పొగను బయటకు వెళ్లేలా చేశారు.
మొత్తానికి అగ్నిప్రమాద సంఘటన ఎంత భయపెట్టినా ఎవరికీ ఎలాంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ సంఘటనని ఆసుపత్రి వర్గాలు, ప్రభుత్వం ఓ బలమైన హెచ్చరికగా తీసుకోవాల్సి వుంది.