లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందనడంతో పాటు అందులో పలు లోపాలున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ Bostan లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Election Commission రాజీ పడింది ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల Maharashtra లో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే Election Commission తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు అని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా- భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరుదేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై BJP మాట్లాడుతూ ఆయన భారతీయ ఓటర్ల నమ్మకాన్ని పొందలేకపోయారని విమర్శలు చేసింది. ఇప్పుడు విదేశీ గడ్డపై మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారు అని బీజేపీ ఎంపీ భండారీ విమర్శించారు. ఈసందర్భంగా విదేశాల్లో భారత పరువును పదే పదే ఎందుకు తీస్తారని రాహుల్ను ప్రశ్నించారు. పార్టీ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావల్లా సైతం రాహుల్పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారతీయ సంస్థలను, న్యాయస్థానాలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు.