జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలోని బ్యాటరీ చష్మా వద్ద ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో భారత సైన్యానికి చెందిన ట్రక్కు 700 అడుగుల లోతైన లోయలో పడిపోయిన ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ట్రక్కు జమ్మూ నుండి శ్రీనగర్ వైపు వెళ్తున్న కాన్వాయ్లో భాగంగా నేషనల్ హైవే 44పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, పోలీసు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళం (SDRF), స్థానిక వాలంటీర్లు కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, ట్రక్కులో ప్రయాణిస్తున్న ముగ్గురు జవాన్లు ఘటనా స్థలంలోనే మరణించారు. అమిత్ కుమార్, సుజీత్ కుమార్, మాన్ బహదూర్లను మృతులుగా గుర్తించారు .
ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా ధ్వంసమై, శరీర భాగాలు, పత్రాలు, ఇతర వస్తువులు లోయలో చెల్లాచెదురుగా కనిపించాయి .
ఇటీవల జమ్మూ కాశ్మీర్లో సైనిక వాహనాలు లోయల్లో పడిపోయిన ఘటనలు పెరుగుతున్నాయి. గత ఆరు నెలల్లో ఇది మూడవ ప్రమాదం కావడం గమనార్హం.