తెలంగాణ, ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇవాళ ఉదయం కర్రె గుట్టల వద్ద భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బలగాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ను సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ధ్రువీకరించారు. ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.