భారత్, పాకిస్తాన్ ల మధ్యా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అనతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫాంస్ పాక్ కు మద్దతుగా నిలుస్తున్న Turkey, Azerbaijan వంటి దేశాలకు కొత్త బుకింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ దేశాలకు అనవసర పర్యటనలు మానుకోవాలని, అక్కడి సున్నితమైన ప్రాంత పర్యటన పణాళికల విషయంలో అప్రమత్తంగా వుండాలని ఆ సంస్థలు సూచించాయి.
Turkey, Azerbaijan, Uzbekistan దేశాలకు కొత్త బుకింగ్స్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రముఖ పర్యాటక సేవల బ్రాండ్ “Cox and Kings” పేర్కొంది. ఆ దేశాలకు అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని భారత ప్రయాణీకులకు Cox and Kings డైరెక్టర్ కిరణ్ అగర్వాల్ సూచించారు.
పహల్గాం దాడి అనంతర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించాలని Ease My Trip తెలిపింది. అత్యవసరమైతేనే Turkey, Azerbaijanలను సందర్శించాలని Ease My Trip సలహా ఇచ్చింది. ట్రిప్ ప్లానింగ్ కు ముందు ట్రావెల్ అడ్వైజరీలను పరిగణనలోకి తీసుకోవాలని Ease My Trip వ్యవస్థాపకుడు నిశాంత్ ట్వీట్ చేశారు.