స్వతంత్ర మీడియా సంస్థ ‘ది వైర్’ వెబ్ పోర్టల్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని ద వైర్ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచార, సాంకేతిక అంశాలకు సంబంధించిన ‘ఐటి చట్టం – 2000’ కింద ‘ద వైర్’ను ప్రభుత్వం బ్లాక్ చేసినట్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్, అనంతర పరిణామాల నేపథ్యంలో సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న దరిమిలా..గురువారం నుంచి మక్తూబ్ మీడియా, ది కాశ్మీరీ యూత్, ఫ్రీ ప్రెస్ కాశ్మీర్ వార్తా సంస్థల వెబ్సైట్లను, సామాజిక మాధ్యమాల్లోని వివిధ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ది వైర్ లో ఒక ఆర్టికల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దాన్ని తొలగిస్తేనే తిరిగి వెబ్ సైట్ కు అనుమతి ఇస్తాం అని చెప్పడం తో వైర్ యాజమాన్యం ఒప్పుకొని ఆ ఆర్టికల్ ను తొలగించింది. తరువాత వెబ్సైట్ యధావిధిగా పని చేస్తోంది.
Add A Comment