గాజాలో మానవీయ సహాయాన్ని అనుమతించకూడదని ఇజ్రాయెల్ ప్రజల్లో మెజారిటీ భావిస్తున్నారు. ఇజ్రాయెల్కి చెందిన ఛానల్ 13 నిర్వహించిన సర్వేలో ఇది వెల్లడైంది.
ఈ సర్వేలో 53% మంది గాజాలోకి సహాయాన్ని అనుమతించకూడదని అభిప్రాయపడగా, కేవలం 34% మాత్రమే ఆహారం, మందులు, నీటిని పంపించడం సమంజసం అని పేర్కొన్నారు.
ఈ సర్వేలో పాలస్తీనా మూలాలున్న ఇజ్రాయెల్ పౌరులు కూడా ఉండటంతో, ఇజ్రాయెల్ యూదు జనాభాలో ఈ వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా.
ఈ ఫలితాలపై స్పందించిన పాలస్తీనీయన్ – ఇజ్రాయెలీ పార్లమెంటు సభ్యుడు Ayman Odeh, “అరబ్ పౌరులు లేకపోతే ఫలితం ఎలా ఉండేదో ఊహించలేను. ఈ సర్వే ఫలితాలను నా పిల్లలకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు,” అంటూ X లో రాశారు.
ఇజ్రాయెల్ ప్రజల్లో సహాయాన్ని నిరోధించాలన్న అభిప్రాయం జనవరి 2024 లో 72% ఉండగా, ఇప్పుడు అది 53 శాతానికి తగ్గింది.
ఐక్యరాజ్యసమితి హెచ్చరిక ప్రకారం, తక్షణ సహాయం లేకపోతే 14,000 మంది చిన్నారులు చనిపోయే ప్రమాదం ఉంది.