నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పోతిరెడ్డిపాలెం వద్ద ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్బంకు వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డి పాలెంలో తమ స్నేహితుడి సోదరి నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
దీంతో స్థానికులు పోలీసులు, 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ ఐదుగురు వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతులను అభిషేక్ రాజ్ (అనంతపురం జిల్లా), జీవన్ చంద్రారెడ్డి (నెల్లూరు), యజ్ఞేశ్ (ప్రకాశం), నరేష్ నాయక్ (అనంతపురం), అభిశశి పురుషోత్తం( తిరుపతి), మరో విద్యార్థి నవనీత్ శంకర్ (కడప) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.