ఆదిలాబాద్ ప్రజల కల త్వరలో నెరవేరనుంది.
రక్షణ శాఖ ఆధ్వర్యంలోని విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాయుసేన శిక్షణ సంస్థతో పాటు పౌర విమాన సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్ కీలక లేఖ రాశారు. ఆ లేఖలో ఆదిలాబాద్ విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈ క్రమంలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ, రాజ్నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గానూ, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
కిషన్ రెడ్డి గతంలో రాజ్నాథ్ సింగ్కు ఒక లేఖ రాశారు, ఆ లేఖలో ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజల కోసం ఉపయోగించాలని కోరారు. దీనిపై స్పందించిన రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీనితోపాటు పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. గతంలో తాను ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన విమర్శించారు.