ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ (Indian Army), ఎయిర్ ఫోర్స్ (Air Force), నేవీ (Navy) సంయుక్తంగా మెరుపు దాడులు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటూ పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. బహావల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్పై క్షిపణి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సుమారు 90 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఎమర్జెనీ (Pakistan Emergency) ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. కొద్ది సేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది.
అలాగే సరిహద్దు ప్రాంతాల్లో భారత్ సైనికులపై పాక్ సేనలు తిరగబడుతున్నాయి. ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం. రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్కు ప్రతికారంగా పాకిస్తాన్ ఇప్పుడు స్పందిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. కాగా భారత్ సేనలు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. అయితే పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది. మదర్సాలలో పెట్టారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తమ మదర్సాలు, మసీదులు, ప్రార్థనా మందిలపై భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతూ.. అక్కడ జరిగిన నష్టాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో సుమారు 90 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్ దాడితో పాకిస్థాన్లో అలజడి రేగింది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను మూసివేసింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి.. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.
పాకిస్థాన్ లోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్ పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన ఫ్లైట్స్ ను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.