Thursday, 15 January 2026

అహ్మదాబాద్‌లో ‘2030 కామన్వెల్త్ క్రీడలు’- బిడ్ దాఖలుకు పచ్చజెండా – 2030

2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చే బిడ్ దాఖలుకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. దీనిపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని భారత సర్కారు ఎంపిక చేసింది. అహ్మదాబాద్‌లో ప్రపంచ స్థాయి స్టేడియంలతో పాటు సకల సౌకర్యాలతో క్రీడా శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.

ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్‌లోనే ఉందని కేంద్రం గుర్తు చేసింది. 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన నరేంద్రమోదీ స్టేడియంలోనూ ఈవెంట్స్ జరుగుతాయని వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్‌‌కు దక్కితే, గుజరాత్ ప్రభుత్వంతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు, దానికి నిధులను ఇచ్చేందుకూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

72 దేశాల క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు భారత సర్కారు అనుమతి లభించడంతో, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇచ్చే ఆసక్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ బిడ్‌ను దాఖలు చేయనుంది. చివరిసారిగా 2010లో దేశ రాజధాని న్యూ దిల్లీ వేదికగా ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. టూరిజం రెక్కలు తొడుగుతుంది.

పీఐబీ ‘అంతర్జాతీయ స్థాయి కలిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు అవకాశం లభిస్తే, భారతదేశ టూరిజం రెక్కలు తొడుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈతరానికి చెందిన ఎంతోమంది యువ అథ్లెట్లు వెలుగులోకి వస్తారు. మరెంతో మందికి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి గొప్ప క్రీడా ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కడం మన దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. భారతదేశ నైతిక బలం మరింత పెరుగుతుంది. దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త అడుగులు పడతాయి’’ అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఇవి తప్పక చదవండి

ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ డ్రా ఖరారు

లివర్‌పూల్ జట్టు బార్న్స్లీపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ సందడి మొదలైంది. సోమవారం రాత్రి జరిగిన డ్రాలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఖరారయ్యాయి. ఈ రౌండ్‌లో ముఖ్యంగా...

నేటి స్కాటిష్ బడ్జెట్: ఆర్థిక సవాళ్ల మధ్య షోనా రాబిన్సన్ కీలక నిర్ణయాలు

నేడు మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు స్కాటిష్ ఆర్థిక మంత్రి షోనా రాబిన్సన్ హోలీరూడ్ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల పౌండ్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం...

తీవ్ర ఒత్తిడిలో హాస్పిటల్స్: నాలుగు ఎన్.హెచ్.ఎస్ ట్రస్ట్‌లలో ‘క్రిటికల్’ పరిస్థితులు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్: చలి తీవ్రత పెరగడం, ఫ్లూ మరియు నోరోవైరస్ కేసులు ఊహించని రీతిలో పెరగడంతో సరీ, కెంట్ మరియు ససెక్స్ ప్రాంతాల్లోని నాలుగు కీలక ఎన్.హెచ్.ఎస్ (NHS) హాస్పిటల్ ట్రస్ట్‌లు...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు