2010 మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్-812 కుప్పకూలింది. ఇది అత్యంత భారీ ప్రమాదం. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చింది. సకాలంలో రన్వేపై ఆగలేకపోయింది. రన్వే దాటి లోయలోకి దూసుకెళ్లింది. మంటలు చెలరేగడంతో 158 మంది మృతి చెందారు. వీరిలో 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1998 జులైలో ఆలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ 737-248 విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న పాంత్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బిహార్ లోని పట్నా విమానాశ్రయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు మరణించగా.. మరో ఐదుగురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు.
1996 హరియాణాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ విమానం 763, కజికిస్థాన్ ఎయిర్లైన్స్ విమానం 1907 ఢీకొన్నాయి. సమాచారం లోపం కారణం ఈ ప్రమాదం జరిగింది. రెండు విమానాల్లో 340కి పైగా మంది ప్రయాణికులు, సిబ్బంది
మరణించారు.
1993 ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్లైన్కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్వేపైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 118 మంది ప్రయాణికులు, సిబ్బంది 55 గ్రౌండ్ సిబ్బందితో కలిపి) ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్వేను తాకడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన 1990 ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. నాడు ఈ ప్రమాదంలో 146 ప్రమాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు.