Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటీ నిర్ణయాలు

June 5, 2025No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరిగింది. వివిధ సంస్థలకు చేసిన భూకేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అదే విధంగా సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, జైళ్లలో సంస్కరణలు తేవాలని నిర్ణయించారు.

ఉద్దానం, కుప్పం రక్షితనీటి సరఫరాకు వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ ఇచ్చేందుకు ఆమోదించారు. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు, వైఎస్సార్‌ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయించారు.

పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలపై చర్చించారు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదించారు. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించాలని, పరిశ్రమలు, కార్పొరేట్ రంగంలో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, కుప్పం నియోజకవర్గంలో రూ.8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల చేయాలని నిర్ణయించారు. పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏడాదిలో 25 మంత్రివర్గ సమావేశాలు జరిపినందుకు సీఎంకు కేబినెట్‌ అభినందనలు తెలిపింది.

ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలి: తుని రైలు ప్రమాదం కేసు అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవటం కంటే ముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు హోంశాఖ కార్యదర్శి సీఎంకు క్షమాపణలు చెప్పారు.

కేంద్రం నుంచి సానుకూల స్పందన: పోలవరం – బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కూడా జరుగుతోందని చెప్పారు. అమరావతిలో చేపట్టే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లు చూడాలని పవన్ కల్యాణ్​ను సీఎం కోరారు. తిరుపతిలో సినీతారలతో యోగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల 15వ తేదీని ఇందుకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రతి జిల్లా కేంద్రంలో పీ-4 కార్యాలయం: పీ4 సక్రమ అమలుకు ప్రతీ నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీ4 విధానం ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు. ఈ నెల 12వ తేదీలోగా ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక పీ4 కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ పైనా ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. 8 గంటల్లో చేసే పనిని క్వాంటంమ్ కంప్యూటింగ్ వ్యాలీ ద్వారా 12 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. క్వాంటంమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే పనివేగం పెరిగి సమయం కలిసి వస్తుందని వెల్లడించారు.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
Amaravati Projects Andhra Pradesh Cabinet AP Government News Chandrababu Naidu P4 Offices Polavaram Project Police Promotions Quantum Computing Valley Safe Drinking Water Women Night Shift
Previous Articleఅమెరికాలో ప్రవేశానికి 12 దేశాల పౌరులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారు
Next Article ఇంటర్ లోనే Btech సబ్జెక్ట్స్.. ఈ ఇయర్ నుంచే 6 కొత్త కోర్సులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.