రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో NDA కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా పై దృష్టి సారించడం ద్వారా మద్యం సేల్స్ మరో స్థాయికి తీసుకెళ్లినట్లు పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నాన్-డ్యూటీ పేయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు రూ.30 వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు సమాచారం.
2024-25లో సగటున రోజుకు రూ. 83.38 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. అయితే కూటమి ప్రభుత్వం(AP Government) లిక్కర్ ధర తగ్గించడంతో అమ్మకాలు (Liquor Sales) పెరిగాయి, కానీ రాబడి పెద్దగా లేదని చెబుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే విక్రయాల్లో 9.1% పెరుగుదల కనిపించింది. విలువ మాత్రం 0.34% పెరిగింది.
ఇక మద్యం అమ్మకాలు ఎక్కువగా కర్నూలు జిల్లాలో జరిగాయి. అత్యల్పంగా కడప జిల్లాలో జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బెల్ట్ షాపులు, నాటు సారా నియంత్రించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.