Saturday, 21 March 2026

విజయవాడ – బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, పైలట్ సకాలంలో అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో 100 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే, గన్నవరం విమానాశ్రయం నుంచి ఓ విమానం 100 మంది ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరింది. విమానం రన్‌వేపై నుంచి గాల్లోకి లేస్తున్న సమయంలో ఓ పక్షి వేగంగా వచ్చి విమానం రెక్కను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానం రెక్క భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సిబ్బంది గుర్తించారు.

ప్రమాదాన్ని వెంటనే పసిగట్టిన పైలట్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం సురక్షితంగా నేలకు దిగడంతో ప్రయాణికులతో పాటు, విమాన సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం ప్రయాణికులందరినీ కిందకు దించివేసి, సాంకేతిక నిపుణులు విమానానికి మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట వ్యవధిలోనే రెక్కకు జరిగిన నష్టాన్ని సరిదిద్ది, విమానం ప్రయాణానికి సురక్షితమని నిర్ధారించారు. ఆ తర్వాత అదే విమానంలో ప్రయాణికులను తమ గమ్యస్థానానికి పంపించారు. సరైన సమయంలో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు