Tuesday, 17 March 2026

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముజామిల్ అరెస్ట్

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఆంధ్రప్రదేశ్ ఎర్ర చందనం అక్రమ రవాణ నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (RSASTF) అధికారులు ఇటీవల అరెస్టు చేశారు.

శనివారం జనవరి 31, 2026 తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం, చిత్తూరు–నాయుడుపేట రోడ్డు వద్ద తనపల్లి క్రాస్ సమీపంలో (చిత్తూరు-నాయుడుపేట జాతీయ రహదారిపై) అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ శ్రీ కులశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం ముందస్తు ప్రణాళికతో పరారీలో ఉన్న ముజామిల్‌ను పట్టుకుంది.
నేపథ్యం:
ముజామిల్‌ కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. అంతర్జాతీయ స్మగ్లర్‌గా గుర్తింపు పొందాడు. లైసెన్స్ పేరుతో ఎర్రచందనం దుంగలను చైనాకు ఎగుమతి చేస్తున్నాడు. శేషాచల అడవుల్లో నరికిన ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉండి, పరారీలో ఉన్నాడు. కొన్ని కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి.

ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎర్ర చందనం స్మగ్లర్లు, కింగ్‌పిన్‌లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ అరెస్టు ఆ దిశగా ముఖ్యమైన అడుగు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు