Thursday, 26 February 2026

సమస్యల్లో చిక్కుకుంటున్న విశాఖ ఉక్కు

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ముడిపదార్థాల కొరత కారణంగా ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడపలేకపోతున్నారు. మొత్తం మూడు బ్లాస్ట్‌ ఫర్నే్‌సల ద్వారా రోజుకు 21 వేల టన్నుల హాట్‌ మెటల్‌ (లిక్విడ్‌ స్టీల్‌) ఉత్పత్తి చేయాల్సి ఉంది. గత నాలుగు రోజుల నుంచి ఇది తగ్గుతూ మంగళవారం నాటికి 10,180 టన్నులకు పడిపోయింది. అంటే సగానికి సగం ఉత్పత్తి తగ్గింది. రెండో బ్లాస్ట్‌ ఫర్నే్‌సలో ఉత్పత్తి మంగళవారం పూర్తిగా నిలిచిపోయింది. ముడిపదార్థాల కొరత కారణంగా బ్లాస్ట్‌ ఫర్నే్‌స-3ని చాలాకాలం మూసేశారు. నిధులు అందుబాటులో లేకపోవడంతో ముడిసరుకు సమకూర్చుకోలేకపోయారు.

కేంద్రం ఇచ్చిన రూ.11,440 కోట్లు, రాష్ట్రం అందించిన రూ.2,600 కోట్ల సాయంతో బ్యాంకుల రుణాలన్నీ తీర్చి, మళ్లీ క్రెడిట్‌ లెటర్లు తీసుకొని యాజమాన్యం ముడి సరుకు సమకూర్చుకుంది. వర్షాకాలం తరువాత బ్లాస్ట్‌ ఫర్నే్‌స-3ను పునఃప్రారంభించాల్సి ఉండగా ప్రస్తుత ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా ఎవరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా జూన్‌ 27నే పునఃప్రారంభించేశారు. ఆ ఒక్క బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ద్వారానే రోజుకు 9వేల టన్నుల హాట్‌ మెటల్‌ ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటివరకు స్టీల్‌ తయారీకి అవసరమైన సింటర్‌, కోక్‌ను ప్లాంటు స్వయంగా తయారు చేసుకునేది. దానివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేది. ప్రస్తుత యాజమాన్యం కమీషన్లకు ఆశపడి సింటర్‌కు బదులు నేరుగా పెల్లెట్లను వినిగియోగిస్తోంది. ఇందుకోసం లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. అదేవిధంగా కోక్‌ తయారీకి కోక్‌ ఓవెన్లు ఉండగా బయటనుంచి కొనడం ప్రారంభించింది. ఇది కూడా అదనపు భారంగా మారింది.

ప్లాంటుకు అవసరమైన ముడి పదార్థాలను నిల్వ చేసి, అక్కడి నుంచి వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా సరఫరా చేసేందుకు రా మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) ఉంది. ఈ కన్వేయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కన్వేయర్లు మొరాయించాయి. మరోవైపు ముడి పదార్థాల సరఫరా తగ్గిపోవడంతో ఉత్పత్తి పడిపోతూ వచ్చింది. మంగళవారం నాటికి బ్లాస్ట్‌ ఫర్నేస్‌-2 జీరో స్థాయికి పడిపోవడంతో దానిని మూసేశారు. ఈ విషయం తెలియడంతో సీఎండీ సక్సేనా మంగళవారం సాయంత్రం ఆర్‌ఎంహెచ్‌పీని తనిఖీ చేశారు. ఎలక్ర్టికల్‌, మెయింటెనెన్స్‌, ఆపరేషన్‌ విభాగాల అధిపతులను సస్పెండ్‌ చేశారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 పునఃప్రారంభానికి ముందునుంచి అన్ని విభాగాల్లో నిర్వహణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టాలని ఉద్యోగ, కార్మిక వర్గాలు సూచిస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరించింది.

కాంట్రాక్టు వర్కర్లు ఎక్కువమంది ఉన్నారంటూ ఈ ఏడాది మే నెలలో 4,500 మందిని తొలగించింది. వారి స్థానంలో ఎటువంటి అనుభవం లేని ఒడిశా, జార్ఖండ్‌ వర్కర్లను తీసుకువచ్చి వారితో పనులు చేయిస్తోంది. దాంతో అనేక విభాగాల్లో నిర్వహణ సమస్యలొస్తున్నాయి. గత 3నెలల్లో మొత్తం 6వేల మందిని తీసేశారు. మిగిలిన ఉద్యోగులు, కార్మికులతో రోజుకు 12గంటలు పనిచేయిస్తున్నారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. 330 శాతం జీతాలు బకాయి పెట్టారు. ఈ క్రమంలో యాజమాన్యానికి, ఉద్యోగ వర్గాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. ఇది ప్లాంటు పనితీరుపై ప్రభావం చూపిస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు