అస్సాం కి చెందిన గిరిజన ప్రజాప్రతినిధి వంతెన ప్రారంభోత్సవంలో తనకు నచ్చిన రంగు రిబ్బన్ ఏర్పాటు చేయలేదని ప్రభుత్వోద్యోగిపై అమానుషంగా దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ ప్రజాప్రతినిధి తన అభిమాన రంగు రిబ్బన్ కట్టకపోవడాన్ని సీరియస్ గా తీసుకొని అక్కడే ఉన్న ప్రభుత్వోద్యోగి చెంపమీద బలంగా కొట్టి, అంతటితో ఊరుకోకుండా అక్కడే వున్న అరటి బోదెతో బహిరంగంగా దాడిచేశాడు. ఈ చర్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అధికార వర్గాలు దీనిపై స్పందిస్తూ, బాధిత అధికారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చాయి.
ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజాసేవకులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇలా అధికార దుర్వినియోగం చేయడం ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకమని నెట్టిజన్లు మండిపడుతున్నారు. ఆ ప్రజాప్రతినిధిపై చర్య తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మని డిమాండ్ చేస్తున్నారు.