America, China మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకి తీవ్రతరమవుతున్నది. సుంకాల విషయంలో America నిర్ణయాలకు ప్రతిగా China కూడా దిగుమతి సుంకాలని పెంచటంతో పాటు అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలు, అయిస్కాంతాలను ఎగుమతి చేయడం నిలిపి వేసింది. ఈ దెబ్బకి Western countries లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరో స్పేస్ తయారీ, సెమికండక్టర్లు తయారు చేసే కంపెనీలకు సమస్యలు ఎదురుకానున్నాయి.
ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను China రూపొందిస్తున్నది. అప్పటివరకు China పొర్టుల నుంచి మాగ్నైట్ ఎగుమతులను నిలిపివేశారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా వీటి సరఫరా నిలిచిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు 90 శాతం China నుండే వెళుతున్నాయి. ఏప్రిల్ 2 నుండి China వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ లోటుని భర్తీ చేసుకోవడం Americaకి ఇబ్బందే. వాణిజ్య ఉద్రిక్తతలు ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని China ఎప్పటి నుండో హెచ్చరిస్తున్నది.
ఐతే China తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం America వరకే పరిమితం కాదు. ఇది అన్ని దేశాలపై ఉండనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్ లో China తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతున్నది. దీనితో పాటు Export Licenceలను పరిమితం చేసే అవకాశం కుడా వుంది. America లోని Tesla, Apple వంటి సంస్థలు చాలా ముడిపదార్ధాల కోసం China పైనే ఆధారపడుతున్నాయి. America వద్ద Rare Earth నిల్వలు ఇప్పటికీ వున్నాయి కానీ తమ Defence Contractor కు సరఫరా చేయడానికి మాత్రం ఇవి సరిపోవు.