Tuesday, 17 March 2026

శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదు

నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలపై రూ.60.48 కోట్ల మోసం ఆరోపణలతో కేసు నమోదైంది. దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, ఆర్థిక నేరాల విభాగం (EOW)కి బదిలీ అయింది. 2015లో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కోసం రూ.75 కోట్ల రుణం కోరిన శిల్పా, రాజ్ దంపతులు, పన్ను ఆదా కోసం దానిని పెట్టుబడిగా మార్చమని ఒప్పించారని, నెలవారీ రాబడి, మూలధనం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని కొఠారి ఆరోపించారు. 2015 ఏప్రిల్‌లో రూ.31.95 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.28.53 కోట్లు బెస్ట్ డీల్ టీవీ ఖాతాలకు బదిలీ చేశారు. 2016లో శిల్పా వ్యక్తిగత హామీ ఇచ్చినప్పటికీ, సెప్టెంబర్‌లో డైరెక్టర్ పదవి నుంచి రాజీనామా చేశారు. 2017లో కంపెనీ దివాలా తీసినట్లు తెలిసింది. కొఠారి డబ్బు తిరిగి పొందే ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిధులను వ్యక్తిగత ఖర్చులకు ఉపయోగించారని ఆరోపించారు. EOW ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది.

శిల్పా, రాజ్ లాయర్ ప్రశాంత్ పాటిల్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారం సివిల్ స్వభావం కలిగినదని, 2024 అక్టోబర్‌లో NCLT ముంబయి తీర్పు ఇచ్చిందని, ఎటువంటి నేరం జరగలేదని, ఆరోపణలు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకేనని పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు