సుప్రీం కోర్టు దిల్లీ, ఎన్సీఆర్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. మూగజీవాలైన కుక్కలు సమాజానికి పెద్ద సమస్య కాదని, వాటిని నిర్మూలించడం సరికాదని అన్నారు. స్థానిక షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.
సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి నటుడు అడవి శేష్ లేఖ:
నటుడు అడివి శేష్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి తీర్పును పునఃపరిశీలించాలని కోరారు. దిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాశారు. జంతు హక్కుల సంస్థలు, మేనకా గాంధీ తీర్పును వ్యతిరేకించారు. దిల్లీలో 3 లక్షల వీధి కుక్కలకు 3 వేల షెల్టర్లు, రూ.15 వేల కోట్ల ఖర్చు అవసరమని మేనకా తెలియచేశారు.
సుప్రీం కోర్టు వీధి కుక్కల వల్ల కుక్కకాటు, రేబిస్ మరణాలు పెరుగుతున్నాయని, వాటిని దూర షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఇతర పార్టీలు, జంతు ప్రేమికుల పిటిషన్లను విచారించబోమని, కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని స్పష్టం చేసింది.


