తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా కుడిమంగళం సిక్కనూత్తు ప్రాంతంలో తండ్రి మూర్తి మరియు కుమారుడు తంగపాండి మధ్య మంగళవారం రాత్రి మద్యం మత్తులో జరిగిన గొడవను అడ్డుకునేందుకు వెళ్లిన ప్రత్యేక ఎస్సై షణ్ముగవేల్ (57) దారుణ హత్యకు గురయ్యారు.
తండ్రీ కొడుకుల మధ్య ఘర్షణ సమాచారం అందుకున్న షణ్ముగవేల్ మరియు ఓ కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకుని, గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. షణ్ముగవేల్ ఫొటోలు తీసే ప్రయత్నంలో ఉండగా, మూర్తి మరో కుమారుడు మణికంఠన్ కత్తితో దాడి చేసి, షణ్ముగవేల్ను హత్య చేశాడు. కానిస్టేబుల్కు గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు మూర్తి, మణికంఠన్ను అరెస్టు చేసి, తంగపాండి కోసం గాలిస్తున్నారు.


