Wednesday, 3 September 2025

ఢిల్లీ సీఎం దాడి తరువాత కమిషనర్ మార్పు కొత్త కమిషనర్ గా సతీష్ గోల్చా

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన 24 గంటల్లోనే కేంద్రం కీలకంగా స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల సున్నితంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది.జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ గోల్చా (IPS officer Satish Golcha) ను ఢిల్లీ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సతీశ్ గోల్చా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకి లాంగ్ సర్వీస్ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆయన జైళ్ల శాఖలో డైరెక్టర్ జనరల్‌గా విజయవంతంగా పనిచేశారు.గతంలో ఆగస్టు 1న ఎస్‌బీకే సింగ్ తాత్కాలిక పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సతీశ్ గోల్చా భర్తీ చేస్తున్నారు. ఆయన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఆగస్టు 21న వెలువడ్డాయి.

బాధ్యతలు తీసుకునే దాకా కొనసాగిస్తారు
సమర్థ అధికారి గుర్తింపుతో సతీశ్ గోల్చాను కమిషనర్‌గా నియమించాం. ఆయన తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగుతారు అని కేంద్ర హోంశాఖ పేర్కొంది.బుధవారం జరిగిన దాడికి కేవలం 24 గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది భద్రతపై కేంద్రం సీరియస్‌గా ఉందని సూచిస్తుంది.సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం రేఖా గుప్తా ప్రజా వినతుల స్వీకరణలో పాల్గొంటున్న సమయంలో ఆ దాడి జరిగింది. ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది.ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీస్ శాఖ తీరుపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే కేంద్రం గోల్చాను కమిషనర్‌గా నియమిస్తూ వేగంగా స్పందించింది.

ఇవి తప్పక చదవండి

యూకేలో విద్యార్థి వీసా ఉల్లంఘనలపై హోమ్ ఆఫీస్ కఠిన చర్యలు

యూనైటెడ్ కింగ్‌డమ్ హోమ్ ఆఫీస్ అంతర్జాతీయ విద్యార్థులు తమ వీసా గడువు ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా దేశంలో ఉండటం, ముఖ్యంగా ఆశ్రయం కోరడంపై కఠిన చర్యలతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు...

ఇంగ్లాండ్‌లోని Skelmersdale లో జైలు అధికారి హత్య కేసులో దోషికి 45 ఏళ్ల జైలు శిక్ష

ఇంగ్లాండ్‌లోని స్కెల్మెర్స్‌డేల్‌లో జైలు అధికారి లెన్నీ స్కాట్‌ను హత్య చేసిన కేసులో ఎలియాస్ మోర్గాన్ (35) అనే సాయుధ దోపిడీ నేరస్థుడికి 45 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. 2024 ఫిబ్రవరి 8న...

యూకేలో 16 ఏళ్లలోపు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

యూనైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇంగ్లండ్‌లో 16 ఏళ్లలోపు వారికి 150 మి.గ్రా./లీటర్ కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ (రెడ్ బుల్, మాన్స్టర్, ప్రైమ్ వంటివి) విక్రయాలను నిషేధించాలని ప్రతిపాదించింది. ఈ...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు