Wednesday, 25 February 2026

ఢిల్లీ సీఎం దాడి తరువాత కమిషనర్ మార్పు కొత్త కమిషనర్ గా సతీష్ గోల్చా

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన 24 గంటల్లోనే కేంద్రం కీలకంగా స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల సున్నితంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది.జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ గోల్చా (IPS officer Satish Golcha) ను ఢిల్లీ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సతీశ్ గోల్చా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకి లాంగ్ సర్వీస్ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆయన జైళ్ల శాఖలో డైరెక్టర్ జనరల్‌గా విజయవంతంగా పనిచేశారు.గతంలో ఆగస్టు 1న ఎస్‌బీకే సింగ్ తాత్కాలిక పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సతీశ్ గోల్చా భర్తీ చేస్తున్నారు. ఆయన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఆగస్టు 21న వెలువడ్డాయి.

బాధ్యతలు తీసుకునే దాకా కొనసాగిస్తారు
సమర్థ అధికారి గుర్తింపుతో సతీశ్ గోల్చాను కమిషనర్‌గా నియమించాం. ఆయన తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగుతారు అని కేంద్ర హోంశాఖ పేర్కొంది.బుధవారం జరిగిన దాడికి కేవలం 24 గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది భద్రతపై కేంద్రం సీరియస్‌గా ఉందని సూచిస్తుంది.సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో సీఎం రేఖా గుప్తా ప్రజా వినతుల స్వీకరణలో పాల్గొంటున్న సమయంలో ఆ దాడి జరిగింది. ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది.ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీస్ శాఖ తీరుపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే కేంద్రం గోల్చాను కమిషనర్‌గా నియమిస్తూ వేగంగా స్పందించింది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు