Friday, 27 February 2026

ఢిల్లీలో 50 స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు.. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు

ఢిల్లీలో మ‌ళ్లీ స్కూళ్ల‌(Delhi Schools)కు బెదిరింపులు వ‌చ్చాయి. ఇవాళ సుమారు 50 స్కూళ్ల‌కు మెయిల్ బెదిరింపు చేశారు. పోలీసులు దీన్ని ద్రువీక‌రించారు. టెర్ర‌రైజ‌ర్స్ 111 అనే గ్రూపు వివిధ స్కూళ్ల‌కు మెయిల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. డీఏవీ ప‌బ్లిక్ స్కూల్‌, ఫెయిత్ అకాడ‌మీ, డూన్ ప‌బ్లిక్ స్కూల్‌, స‌ర్వోద‌య విద్యాల‌య‌తో పాటు ఇత‌ర స్కూళ్ల బెదిరింపులు వ‌చ్చాయి. 25 వేల డాలర్లు ఇవ్వాలంటూ ఆ బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.

క్రిప్టోక‌రెన్సీ రూపంలో 5వేల డాల‌ర్లు ఇవ్వాలంటూ అదే గ్రూపు ఆగ‌స్టు 18వ తేదీన బాంబు బెదిరింపుల‌కు పాల్ప‌డింది. ప్రిన్సిపాల్స్‌, అడ్మినిస్ట్రేట‌ర్స్‌కు బెదిరింపు గ్యాంగ్ బ‌ల్క్ మెయిల్ పంపింది. ఐటీ సిస్ట‌మ్స్‌ను ఉల్లంఘించిన‌ట్లు తెలిపారు. స్కూల్ ఆవ‌ర‌ణ‌ల్లో 48 గంట‌ల్లోగా బాంబులు పేల్చుతామ‌ని మెయిల్‌లో పేర్కొన్నారు. మేం టెర్ర‌రైజ‌ర్స్ 111 గ్రూపుకు చెందిన‌వాళ్ల‌మ‌ని, మీ బిల్డింగ్‌లో పేలుడు ప‌దార్ధాలు అమ‌ర్చామ‌ని, క్లాస్‌రూమ్‌లూ.. ఆడిటోరియంలు, స్టాఫ్ రూమ్‌లు, స్కూల్ బ‌స్సులను శ‌క్తివంత‌మైన సీ4 బాంబుల‌తో పేల్చివేస్తామ‌ని బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు